సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలకేంద్రం గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఈ బ్లాక్లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.