హైదరాబాద్: గురుకుల హాస్టల్లో ఉక్మా పంచాయితీ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. గచ్చిబౌలిలోని (Gachibowli) గౌలిదొడ్డి బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్లో విద్యార్థి గొంతు కోసిన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 26న రాత్రి అల్పాహారంలో భాగంగా సాత్విక్ అనే విద్యార్థి ఉప్మా తింటున్నాడు. అయితే పొరపాటున అది మరో విద్యార్థి చేయి మీద పడింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ఘర్షణకు దారితీయంతో క్యాంపస్ టీచర్ విద్యార్థులకు సర్దిచెప్పి పంపిచేశారు.
అయితే అర్ధరాత్రి సమయంలో సాత్విక్ గొంతును తోటి విద్యార్థి బ్లేడు కోశాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం కాడంతో గచ్చిబౌలి దవాఖానకు తరలించారు. కాగా, ప్రస్తుతం సాత్విక్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.