హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఒక రూపాయి నిధులు తీసుకురావడం తెలియని బీజేపీ నేతలకు నిందలు వేయడం బాగా వచ్చని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పు గురించి మాట్లాడే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మోదీ 9 ఏండ్లలో మోదీ ప్రభుత్వం చేసిన రూ.100 లక్షల కోట్ల అప్పు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణను చూడలేకే బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సరార్ తీసుకువచ్చిన అప్పుతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుతో ఏం సాధించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. గతంలో 14 మంది ప్రధానమంత్రులు 67 ఏండ్లలో రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే తొమ్మిదేండ్లలో మోదీ ఒకడే రూ.100 లక్షల కోట్ల అప్పు చేశాడని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణలో తెలంగాణ ఇతర రాష్ర్టాల కన్నా ముందుందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తే గల్లీ నేతలు అవాకులు చవాకులు పేలుస్తున్నారంటూ మండిపడ్డారు.బీజేపీ నేతలకు దమ్ముంటే మోదీని అప్పుపై ప్రశ్నించాలని సవాల్ విసిరారు.