భూపాలపల్లి: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 40 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలకు నష్టం వాటిల్లింది. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో మూడు రోజులపాటు సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగ్గు గనుల్లో సమ్మె విజయవంతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం సింగరేణి కార్మికులు భూపాల్పల్లి ఏరియాలో విధులకు హాజరు కాలేదు.