ఆర్సీవో స్వరూపారాణి
బెల్లంపల్లిరూరల్, మార్చి 22 : తరగతి గదిలో ఉపాధ్యాయుల పాఠ్యబోధనకు బోధనాభ్యసన పరికరాలు గొప్ప ఆభరణాలని ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి అన్నారు. సోమవారం సాయం త్రం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన ఆదిలాబాద్ రీజియన్ స్థాయి తెలుగు బోధనాభ్యసన పరికరాల ప్రదర్శన ( టీఎల్ఎం) మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను ఉపయోగించి పాఠ్యాంశానికి తగినట్లుగా రూపొందించుకున్న బోధనాభ్యసన పరికరాలు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయన్నారు. తెలుగు పాఠ్య బోధనలో పద్యభాగంలోని పద్యాలను శ్రవ్యంగా, లయబద్ధ్దంగా పాడడం ద్వారా తరగతి గది రసవత్తరంగా మారుతుందని పేర్కొన్నారు. గురుకలాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు రీజియన్లోని 17 గురుకులాల కు సంబంధించిన ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారీగా సబ్జెక్ట్ ఫోరంను ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ఇందులో భాగంగానే బెల్లంపల్లి బాలుర గురుకులంలో తెలుగు సబ్జెక్ట్ ఫోరం సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, బాలికల కళాశాల ప్రిన్సిపా ల్ స్వరూప, వైస్ ప్రిన్సిపాల్ ప్రమోద్కుమార్, సీనియర్ ఉపాధ్యాయులు దూలం ఎల్లయ్య, సబ్జెక్ట్ కోఆర్డినేటర్లు కోట రాజ్కుమార్, సేరాల లావణ్య, రీజియన్ పరిధిలోని తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.