ఆదిలాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేండ్లలో హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 286.13 కోట్ల మొక్కలు నాటామని, ఇందుకోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.
2019 నుంచి 2021 వర కు దేశంలో ఎక్కువగా మొక్కలు నా టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. హరితహారంతో రాష్ట్రంలో పచ్చద నం 7.9 శాతం పెరిగినట్టు తెలిపారు. రాష్ట్రం లో అటవీ, పంచాయతీ శాఖ, హెచ్ఎండీఏ పరిధిలో 15,500 నర్సరీలను నడుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని, బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా రైతులు, ఇతర వర్గాల నుంచి మంచి ఆదరణ వస్తున్నదని చెప్పారు.