ఉప్పల్, సెప్టెంబర్ 24 : దళితబంధు పథకం దళితులందరికీ జీవితబంధుగా మారుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హబ్సిగూడలో జరిగిన ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. దళితబంధు పథకం ప్రపంచంలోనే చిరస్థాయిలో నిలి చే పథకమని తెలిపారు. రాష్ట్రంలోని దళితులు ఉన్నత స్థితిలో బతికేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదని కొనియాడారు. త్వరలో దళితబంధు ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహిస్తామని వెల్లడించారు. దళితలోకం సీఎం కేసీఆర్ వెంటనడవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోర్కమిటీ సభ్యులు శంకర్, డా.మల్లేశ్, శివరాజ్, ఉస్సేన్, బాబు, గణేష్ పాల్గొన్నారు.