హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశం గర్వించే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర లీగల్సెల్ సమావేశానికి వినోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో 7,778 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాయి ఉంటే ఇప్పుడది 18 వేల మెగావాట్లకు చేరిందని ఉదహరించారు. రానున్న కొద్ది నెలల్లోనే విద్యుదుత్పత్తి 25,000 మెగావాట్లకు చేరుతుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో పూర్తి చేసుకోవడం, పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు చివరి దశకు చేరుకోవడం ప్రపంచసాగునీటి రంగంలోనే చారిత్రక ఘట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్రావు, ముద్దసాని సహోదర్రెడ్డి, గణేశ్, తిరుమల్రావు, వెంకటేశ్వర్లు, దేవేందర్రెడ్డి, రమణారెడ్డి సహా 33 జిల్లాల లీగల్ సెల్ బాధ్యులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ రాష్ట్ర లీగల్ సెల్ తీర్మానించింది.