Srisailam Reservoir | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వస్తున్నది. శనివారం ఉదయం నుంచి జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లద్వార 1,19,070 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తిద్వారా మరో 29,805 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. అలాగు సుంకేసుల నుంచి 2,181 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. ప్రస్తుతం సాయంత్రం వరకు 92,511 క్యూసెక్కుల వరద రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నది.
జలాశయంలో నిల్వ 825.90 అడుగులుగా నమోదైంది. అదే విధంగా ఏపీ పవర్హౌస్, టీఎస్ పవర్హౌస్లో విద్యుదోత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు అధికారుల తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837.90 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం 58.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఆదివారం ఉదయం నుంచి ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.