హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన కులగణన లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. బీసీల జనాభాను తక్కువచేసి చూపుతున్నారని మండిపడ్డారు. 56 శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టే జనగణన సర్వేలో బీసీ కుటుంబాల కాలమ్ లేనందునే కులగణన వివరాలు బయటపెట్టారని పేర్కొన్నారు. బీసీలకు కేంద్రం, రాష్ట్రం తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.