ముంబై, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్లీ విజయం చేకూరాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మహారాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు నీలం తాయి ఖేమ్కర్, కోపర్ గావ్ అసెంబ్లీ సమన్వయకర్త బాలా సాహెబ్ జాదవ్, ప్రకాశ్ హాన్లు షిర్డీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ వచ్చి తమ మొకులు తీర్చుకొంటామని సాయి బాబాను వేడుకొన్నారు.
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని తామందరి కోరిక అని తెలిపారు. ఇందుకు సాయిబాబా ఆశీస్సులు కూడా ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు వైశాలి తాయి జాదవ్, మనిషా తాయి , హర్ష తాయి ఇంగళే, సచిన్ వాబళే, ప్రదోష్ శిందే, లక్ష్మణ్ వైరాళ్, రావు సాహెబ్ టెకే లతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.