హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియపై బీఆర్ఎస్ తరఫున పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించినట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, వై సతీశ్రెడ్డి, నాయకులు ముజీబుద్దీన్, సుమిత్రా ఆనంద్, అభిలాష్ రంగినేని ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ తరఫున బీఎల్ఏలను సమన్వయం చేసుకోవడం, వారికి వచ్చే సందేహాలను నివృత్తిచేయడం, పార్టీ కేంద్ర కార్యాలయానికి క్షేత్రస్థాయి పరిస్థితులను సమన్వయం చేయడం తదితర బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సంఘంతో ఎప్పటికప్పుడూ సమన్వయం చేస్తూ పార్టీ తరఫున ‘సర్’ నిర్వహణ ప్రక్రియలో ఈ కమిటీ కీలకపాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.