హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి, స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ చైర్మన్ కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని చిత్తడి నేలల పరిరక్షణ, గుర్తింపు తదితర అంశాలపై బుధవారం సచివాలయంలో ఆమె అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో రకాల మొకలు, పక్షులు, జంతువులకు ఆవాసంగా నిలుస్తున్న ఈ నేలలను గుర్తించి, వాటి పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఒకొక శాఖవారీగా చిత్తడి నేలలను గుర్తిం చి, నిపుణుల కమిటీకి సమర్పించాలని సూచించారు. ఆ కమిటీ మార్గనిర్దేశకాలతోపాటు, క్షేత్రస్థాయిలో పర్యటించి చిత్తడి నేలలను గుర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తద్వారా వాటిని పరిరక్షించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని మంత్రి సురేఖ చెప్పారు.