కామారెడ్డి : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. పసుపు, కుంకుమ, పూలు సమర్పించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ..క్యాచ్ మెంట్ ఏరియలో భారీ వర్షాలు, వరదలతో మంజీర నదిలోకి భారీగా ప్రవాహం వస్తుందన్నారు.
దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఇంకా 60,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిన్న ఫ్లడ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశామన్నారు.
జూలై నెలలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడం అరుదు అని తెలిపారు.
ఆయకట్టులో ఈ ఏడాది రెండు పంటలకు సాగునీటికి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు.రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు ఉన్నారు.