నిజామాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మంగళవారం రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాపై చాదర్, పుష్పలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయనకు దర్గా పెద్దలు స్వాగతం పలికారు. ఆయన వెంట శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
పోచారం శ్రీనివాస్రెడ్డి రాజస్థాన్లో ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (AIPOC)లో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన దర్గాను సందర్శించారు.