కామారెడ్డి, అక్టోబర్ 26 : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలుపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. ఇది ఎన్నికల కోసం ప్రకటించిన పథకం కాదని, ఎన్నికల నియమావళి పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. యాసంగిలో పెట్టుబడి సాయం ఇవ్వకపోతే రైతులు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాయం అందిస్తే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలనడానికి నోరెలా వచ్చిందని ఆయన మండిపడ్డారు.