కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాన్సువాడ లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా, మతిభ్రమించి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. వ్యవసాయం, రైతుల గురించి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని పోచారం తెలిపారు. సాగునీటి రంగంపై గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ లో బోర్లు పెరిగాయన్నారు. రైతుల పొట్ట కొట్టే విదంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు.రైతులను తప్పుదోవ పట్టిస్టూ సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న పనులు అర్ధం పర్ధం లేనివని, హైదరాబాద్ చుట్టూ పక్కల రైతులను భయపెట్టి భూ కబ్జాలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్.వ్యవసాయాన్ని దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అయితే దాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.పీసీసీ పదవిని రేవంత్ కు ఇప్పించిందే చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబు ఏజెంట్ రేవంత్.
చంద్రబాబు రేవంత్ ఇద్దరూ ఒక్కటేనని చెప్పారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి ఖావడం ఖాయమని, సర్వేలు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నాయని పోచారం తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాల ఆటలు సాగవన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఎజాజ్, పాత బాలకృష్ణ, దొడ్ల వెంకట్రామిరెడ్డి, బుల్లెట్ రాజు పాల్గొన్నారు.