కామారెడ్డి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో కూడా సీఎంఆర్ఎఫ్ పథకం ఉన్నప్పటికి పేదలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్థిక స్థోమత లేక దవాఖానలో చేరిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధితో అండగా ఉంటున్నారు. సీఎంఆర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ట్రైనీ కలెక్టర్ శివేంద్రా ప్రతాప్, ఆర్డీవో రాజా గౌడ్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.