నిజామాబాద్ : బర్మింగ్హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల నిఖత్ జరీన్కు ఘన స్వాగతంతో.. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి వేముల వ్యక్తి గతంగా నగదు ప్రోత్సాహకం అందించి, మరిన్ని పథకాలు సాధించి తెలంగాణ, నిజామాబాద్ పేరు విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఐర్లాండ్కు చెందిన బాక్సర్ కార్లీ మెక్నాల్ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది.
ఫైనల్లో కార్లీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ 5-0 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ నిఖత్ ఇదే స్కోరుతో గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్ను అంపైర్ మరో రెండున్నర నిమిషాలు ఉండగా.. ఆపేసి నిఖత్ను విజేతగా ప్రకటించారు.