అసెంబ్లీలో పలువురు సభ్యులు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తిరస్కరించారు.
మక్కజొన్న పంట కొనుగోలు జాప్యంపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, రిటైర్డ్, ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్పై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటుచేసి వేతనాలు చెల్లించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.