కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 10 : టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు ఎంతటి వారికైనా సమానమేని నిరూపించారు ఎస్పీ డాక్టర్ వినీత్. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల టెన్త్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించేందుకు వచ్చారు.
గేటు వద్ద విధుల్లో కానిస్టేబుల్.. ‘సార్ మొబైల్ ఫోను..’ అని చెప్పబోయాడు. వెంటనే వెనక్కి వచ్చిన ఎస్పీ వినీత్.. తన మొబైల్ ఫోన్లను అక్కడ సిబ్బందికి అప్పగించారు. ఆ తరువాత కానిస్టేబుల్ ఆయనను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించిన కానిస్టేబుల్ను ఎస్పీ అభినందించారు.