రేగొండ, ఏప్రిల్ 5: వివాహేతర సం బంధం పెట్టుకున్న తండ్రిని కొడుకులు గొడ్డలితో నరికి చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండ లం రేపాకలో జరిగింది. పోలీసుల కథ నం ప్రకారం.. రేపాకకు చెందిన కుర్రె చేరాలు(55) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లో కూలి పనులు చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఒంటరి మహిళతో చేరాలు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మూడు రోజల క్రితం చేరాలు స్వగ్రామానికి వచ్చి సదరు మహిళతో కలిసి ఉం టున్నట్టు తెలుసుకున్న కొడుకులు రాము, లక్ష్మణ్ శనివారం రేపాకకు చేరు కున్నారు. వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలుపులు పగులగొట్టి తండ్రి చేరాలుతోపాటు మహిళపై దాడి చేశారు. తండ్రి తలపై బలమైన గాయం కాగా, మహిళ చేయి విరిగింది. చేరాలును ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొం దుతూ ఆదివారం మృతి చెందాడు.