హైదరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ సోమ భరత్ కుమార్.. ఇవాళ తెలంగాణ భవన్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సోమ భరత్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో పచ్చదనం పెరిగిందని తెలిపారు. తనకు చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు సోమ భరత్ ధన్యవాదాలు తెలిపారు.