BRS Party | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల సర్పంచ్లో గులాబీ గూటికి చేరారు. సర్పంచ్లందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన ఛైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్, సోలాపూర్ ముఖ్య నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.