కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. గమనించిన వీధి శునకాలు వెంటపడటంతో అది అక్కడి నుంచి పారిపోయింది.
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకున్న ఎలుగుబంటి.. వాహనాలు చూసి భయపడి సమీపంలో ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నది. దానిని చూసి భయాందోళనలకు గురైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.