Breaking News | మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటో, బైక్ను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులను మేడిగడ్డ తాండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా గుర్తించారు. వీరు తండాల నుంచి బాలానగర్లో జరిగే వారపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన పలువురు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనతో 44వ జాతీయ రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.