హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 21: ‘దసరా పండుగకు ఇంటికాడలేం.. దళితబంధు కింద పాడి గేదెలు తెచ్చుకునేందకు హర్యానా పోయినం.. మా ఇంటికి బర్రెలు వచ్చిన రోజే మాకు పండుగ దినం.. ఈ రోజే పండుగ జరుపుకుంటున్నం’.. అని హుజూరాబాద్ మండలం సింగాపూర్ దళితులు సంబురపడుతున్నారు. ఇండ్ల ముంగట బర్రెలు, దుడ్డెలు సందడి చేస్తుండగా, తినకున్నా, తిన్నంత ఆనందమైతున్నదని పేర్కొంటున్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్కు చెందిన ఆరుగురు దళితులు డెయిరీ యూనిట్ను ఎంచుకున్నారు. వారం రోజుల కింద వీరు పాడిగేదెల కోసం హర్యానాకు వెళ్లారు. తలా నాలుగు పాడి గేదెల చొప్పున కొని, గురువారం సింగాపూర్ చేరుకున్నారు. ఈ రోజునే దసరాగా భావించి, గొర్రెను కోసుకొని పండుగా జరుపుకున్నట్టు వారు వివరించారు.
కట్టపడ్తం.. సారు పేరు నిలబెడ్తం
మా దేవుడు కేసీఆర్ సార్.. కూలిపని కోసం రోజూ ఎదురుచూసేటోళ్లం. నా భర్త అమాలి. మా బతుకులు ఇంతే అనుకున్నం. దేవుని లెక్క సీఎం సార్ దళితబంధు కింద పది లచ్చలు అకౌంట్ల వేసిండు. ఇది కలనా! నిజమా! అనిపించింది. బర్లు ఇంటికి తెచ్చినంక తినకున్నా, తిన్నంత అయ్యింది. నాలుగు బర్లు తీసుకొచ్చినం. ఒక్క బర్రె పాలిస్తాంది. మూడు బర్రెలు సూటివి. మరోసారి పోయి మరో మూడు బర్రెలను తెచ్చుకుంటం. కేసీఆర్ సార్ మా దళితులందరికి దేవుడే.
దళితబంధు తెచ్చిన దసరాఏ పార్టీల నాయకులు వచ్చి ఎన్ని మాటలు జెప్పినా, మేం నమ్మం. కేసీఆర్ సార్ చెప్పింది చేసిండు. ఆయన మా దళితులకు దేవుడు. ఆయన వెంటే మేముంటం. మా కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ సార్ మేలు మరచిపోం. నాలుగు బర్రెలు తెచ్చుకున్న. వాటితో లాభపడుత.
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేం..
అన్ని రకాల కట్టాలు అనుభవించిన. మాకు గుంట భూమి సుత లేదు. ఇద్దరు ఆడివిల్లల పెండ్లిలు సుత కూలికి పోయి, అప్పులు జేసి చేసిన. తిననీకి తిండి లేక పస్తులున్న దినాలు సుత ఉన్నయి. నా కొడుకు బర్రెలు కొనుకొచ్చినంక నా కండ్లపొన్న నీళ్లు అచ్చినయి. మేము సచ్చిపోయేంత వరకు కేసీఆర్ సార్కు రుణం తీర్చుకోలేం.