హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా సీతారంజిత్రెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం శ్రీవారి ఆలయంలో జేఈవో వీరబ్రహ్మం ఆమెతో ప్రయాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీతారంజిత్రెడ్డి మాట్లాడుతూ.. దేవుడి సేవ చేసేందుకు అవకాశం దకడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు రుణపడి ఉంటానని, సామాన్య భక్తులకు మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తామని తెలిపారు.