సత్తుపల్లిటౌ న్, జూలై 17 : ‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు.
రూ.19వేల కోట్ల ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం, మోటర్లు, భూసేకరణ, కాలువలు తవ్వకాలకు ఖర్చు పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న కాలువ తవ్వి ఇదంతా తమ గొప్పతనమేననడం తగదన్నారు.