హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు పంటలకు మద్దతుధర పొందాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. శుక్రవారం శాసనసభ ఆవరణలోని తన చాంబర్లో వానకాలం పంటల మద్దతుధరలపై మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను మంత్రి నిరంజన్రెడ్డి విడుదల చేశారు. రైతులు పత్తిలో తేమ 8-12 శాతంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకుడు లక్ష్మణుడు పాల్గొన్నారు.
విత్తనాభివృద్ధి సంస్థ సేవల్లో మరింత వేగం పెంచేందుకు, విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించి నాణ్యతను పరిరక్షించేందుకు ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సెంటర్ను శుక్రవారం విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నాలుగో సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలకు తెలంగాణ కేరాఫ్గా మారిందన్నారు. కరోనా సమయంలోనూ ఇతర రాష్ర్టాలకు విత్తనాలను అందించడం అభినందనీయమని తెలిపారు.