హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ ప్రజా సంబంధాల అధికారి శ్రీరాముల శ్రీకాంత్కు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. ‘రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ సోషల్ అండ్ పొలిటికల్ మూవ్మెంట్స్ ఏ కేస్ స్టడీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్’ అన్న అంశంపై ఇఫ్లూ అసొసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం పర్యవేక్షణలో శ్రీకాంత్ పరిశోధనను పూర్తిచేశారు.
మీడియా సంస్థల్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో శ్రీకాంత్ సేవలందించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అధికారులు ఆయనను శనివారం అభినందించారు.