Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో సింగరేణి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపపడ్డాయి.