గద్వాల టౌన్, ఏప్రిల్ 2 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టారు. 76 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు గురువారం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదును పరిశీలించగా పలుచోట్ల సక్రమంగా నమోదు కాకపోవడాన్ని గుర్తించి.. మొత్తం 61 పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. సంబంధిత సిబ్బంది మూడ్రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సూచించారు.