హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు చేపట్టారు. లోక్భవన్లో ఉదయం శివప్రతాప్ శుక్లాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్కుమార్ తెలుగులో ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ శివప్రతాప్సింగ్ శుక్లా మాట్లాడుతూ.. ‘నాపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, క్యాబినెట్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు.
అందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామని విశ్వసిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ శుక్లాకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన శివప్రతాప్ శుకా ్ల ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. యూపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా, సహాయ మంత్రిగా పనిచేశారు. 2023-26 మధ్య హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు.