వరంగల్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడిన వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కే లేదని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం ఆమె మన్సిపల్ కార్పొరేషన్లోని తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని ఓర్వలేక తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు షర్మిల కుట్రలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రౌడీలను వెంటేసుకుని పాదయాత్ర చేస్తున్న షర్మిల.. కేసీఆర్పై, ఉద్యమకారులపై వ్యక్తిగత దూషణలు చేయం ఆమె దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.