హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్వోతో పాటు విరియా నాయక్ అనే వ్యక్తిని సైతం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టింబర్ డిపో అనుమతి కోసం రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎఫ్ఆర్వో అవినీతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. శంషాబాద్ ఎఫ్ఆర్వో శ్యామ్ కార్యాలయంతో పాటు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. శంషాబాద్ కోత్వాల్గూడలో టింబర్ డిపో అనుమతి కోసం లంచం అడుగుతున్నారని సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు ఎఫ్ఆర్వోను పట్టుకున్నారు.