నల్లగొండ : నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరకు ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆరెస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసిలు కాగా మిగతవారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసిలు.
నిన్న ఒకరు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వారిలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పిటిసి కుడుదుల నగేష్ కూడా ఉన్నారు. దీంతో మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా అందులో ముగ్గురివి స్క్రూటినీలో ఎగిరిపోయారు. మిగిలిన వారిలో ఒక్కరు ఉప సంహరణ చేసుకోగా తుది జాబితాలో ఏడుగురు అభ్యర్థులు మిగిలారు.
అయితే టీఆర్ఎస్కు చెందిన ఎంసీ కోటిరెడ్డి విజయం ఎక్కడ ఏపక్షమే అయినా పోలింగ్ నిర్వహించక తప్పడం లేదు. అయితే అభ్యర్థుల తుది జాబితా అధికారికంగా మరికొద్ది సేపట్లో వెల్లడి కానుంది.
ఇవి కూడా చదవండి..
వివాహితతో ఎస్ఐ రాసలీలలు..రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
భూ వివాదంతో దళిత కుటుంబం హత్య.. బాలికపై సామూహిక లైంగికదాడి
40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు