హైదరాబాద్ : గొప్ప సంఘసంస్కర్త, గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) జయంతి వేడుకలు గురువారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు మత్తు పానియాలు, హింసకు దూరంగా ఉండాలని సేవాలాల్ పిలుపునిచ్చారన్నారు.
యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహరాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాంటి మహనీయులు చూపిన మార్గంలో పయనించి దేశాభివృద్ధి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన “సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి” వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS..
ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి @BRSKavitha, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శ్రీమతి @Satyavathi_BRS, మాజీ మంత్రి శ్రీ @Koppulaeshwar1, మాజీ ఎమ్మెల్యే శ్రీ… pic.twitter.com/AAdXEsb1CS
— BRS Party (@BRSparty) February 15, 2024