హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన పది మంది సీనియర్ అధికారులకు ప్రభుత్వం ఐఏఎస్ హోదా కల్పించింది. వీరిలో జల్ద అరుణశ్రీ, ఏ నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్, కోరం అశోక్ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్ ఐఏఎస్ హోదా దక్కింది. జనవరి ఢిల్లీలో రాష్ట్ర అధికారులకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇంటర్వ్యూ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం పంపినట్లు తెలిసింది. ఇందులో రెవెన్యూ కోటాలో ఐదుగురికి, నాన్ రెవెన్యూ కోటాలో ఐదుగురికి హోదా దక్కింది.