కాంగ్రెస్ ప్రభుత్వంపై సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సీరియస్ అయ్యారు. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు సన్మానాలు.. ఉద్యమకారులకు అవమానాలు ఎదురయ్యాయయని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరిపే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వంలో అవమానిస్తున్నారని తెలిపారు.
ఆనాడు డీజీపీగా ఉన్న మహేందర్రెడ్డిపై సీఎం అనేక వ్యాఖ్యలు చేశారని పాశం యాదగిరి గుర్తు చేశారు. నేడు అదే మహేందర్రెడ్డిని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అప్పగించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఏమైనా ఉద్యమకారులా అని ప్రశ్నించారు. జయజయహే తెలంగాణ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్గా తెలంగాణ వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆంధ్రాకు చెందిన కీరవాణీకి తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు