హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర, దక్షిణ డిస్కమ్లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని ఆశ్రయించాయి. మొత్తం 2,545 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన టారిఫ్ను ఆమోదించాలని పిటిషన్ దాఖలు చేశాయి. విద్యుత్తు చట్టం-2003లోని 63, 86(1)(b) సెక్షన్లతోపాటు తెలంగాణ విద్యుత్తు సంసరణల చట్టం-1998లోని సెక్షన్ 21(4) ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాల కింద మూడు వేర్వేరు సంస్థల నుంచి సౌర విద్యుత్తు కొనుగోలు చేయాలని డిసమ్లు ప్రతిపాదించాయి. మొత్తం 2,545 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్టు ఆ పిటిషన్లో పేరొన్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా తకువ ధరలో నాణ్యమైన విద్యుత్తును అందించడమే ఈ కొనుగోళ్ల ప్రధాన ఉద్దేశమని తెలిపాయి. ఈ పిటిషన్పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా తెలియజేయవచ్చు. డిస్కమ్ల పిటిషన్పై టీజీఈఆర్సీ విచారణ నిర్వహించిన అనంతరం టారిఫ్ ఆమోదంపై తుది నిర్ణయం తీసుకుటుంంది. కమిషన్ అనుమతి లభించిన తర్వాత డిసమ్లు ఆయా సంస్థల నుంచి అధికారికంగా సౌర విద్యుత్తు కొనుగోళ్లు చేపడతాయి.
