హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : అవినీతిని నిరోధించడంలో ముందస్తు అప్రమత్తతతోపాటు సాంకేతికత అత్యవసరమని డీవోపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శి రచ్నా షా పేర్కొన్నారు. మంగళవారం ‘ఇన్నోవేషన్ అండ్ టె క్నాలజీ ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాల న’ అంశంపై నిర్వహించిన బ్రిక్స్ ప్రత్యేక స మావేశంలో ఆమె మాట్లాడారు.
డిజిటల్ గుర్తింపు, ఎలక్ట్రానిక్ సేవల పంపిణీ, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థల ద్వారా అవినీతికి అవకాశాలు తగ్గడంతోపాటు ప్రజా పర్యవేక్షణ బలోపేతం అ వుతుందని వివరించారు. దేశంలోని జాతీయ ప్రభుత్వ కొనుగోలు వేదిక గవర్నమెంట్ ఈ-మారెట్ ప్లేస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలను సాంకేతిక ఆధారిత సంసరణలకు ఉదాహరణలుగా రచ్నా షా ప్రస్తావించారు. అవినీతి కేసుల్లో నేరస్తులను గుర్తించి అప్పగించేందుకు బ్రిక్స్ అనధికార సహకార రిపోజిటరీపై చర్చించారు.