వరంగల్ రూరల్ : స్వీయ నియంత్రణయే మనకు శ్రీరామ రక్ష అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.కరోనా వైరస్ తీవ్రత పెరిగింది. భయపడకండి. హోం ఐసోలేషన్లో ఉండండి. సర్కారు దవాఖానాలో ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోండని సూచించారు.
ఈ సారి శ్రీ సీతారాముల కళ్యాణం చూడలేదని బాధ పడకండి. వచ్చే సారి ఆరోగ్యవంతంగా వుండి పండుగ జరుపుకుందామని మంత్రి తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులు కరోనా బాధితుల కష్టాల్లో పాలుపంచుకోవాలన్నారు. కరోనా వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు పోయిందని జాగ్రత్తగా ఉండాలని మాస్కులు ధరిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు!