హైదరాబాద్ : ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులను హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి 23వ తేదీ వరకు రాష్ర్టంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భ, మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కి.మీ. ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి బుధవారం బలహీనపడింది. ఇవాళ ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది.
దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఉరుములు మెరుపులు, గంటలకు 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 23వ తేదీన ఉరుములు మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.