మెదక్ : పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలోని చల్మెడలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన తుమ్మల నాగరాజు(45) మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద పనుల చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము మృతుని ఎడమకాలు పాదంపై కాటు వేయడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రకాశ్గౌడ్ తెలిపారు.