జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 2 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని కావేరమ్మపేట వద్ద నిర్మించిన 120 డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియ విడతల వారీగా ఉంటుందని అన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇండ్ల కేటాయింపులో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించిన తర్వాతే అర్హులను ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు.