కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు ఓట్లు అడుగుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నగరంలోని 25 వ వార్డు సూపర్ బజార్లో మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వార్డులోని లాండ్రీ వద్ద మంత్రి బట్టలు ఇస్త్రీ చేసి ఓటర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..రజకులకు, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చింది. వారి అభివృద్ధికి చేదోడు, వాదోడుగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
సబ్బండి వర్ణాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
ఇవి కూడా చదవండి..
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. మనకూ తప్పదా.. ఎందుకీ దుస్థితి?
Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
T20 World Cup | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లో గెలుపెవరిది.. అఫ్రిది అంచనా ఇదీ!