హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ఎస్సీ గురుకుల కళాశాలలలో చదివి గత ఏడాది ఎంబీబీఎస్లో 204, ఐఐటీల్లో 65, నీట్లో 80, ఐఐటీ/జీఎఫ్టీఐ సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం గురువారం అభినందన సభ నిర్వహించింది. హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ అసోసియేషన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సభలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ..
నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని, దీనిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఓఎస్డీ చంద్రకాంత్, జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్, ఓఎస్డీ ఆపరేషన్స్ ఏవీ రంగారెడ్డి పాల్గొన్నారు.