తొర్రూరు, ఏప్రిల్ 5: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు – మన బడి’తో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం కంఠాయపాలెం ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, కలెక్టర్ శశాంకతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సర్కారు బడులను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో నీటివసతి, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌక ర్యం, ఫర్నిచర్, డిజిటల్ క్లాసుల వంటి సౌకర్యాలను కల్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మూడు విడుతల్లో చేపట్టనున్నట్టు వెల్లడించారు. తొలి విడుత 9,123 పాఠశాలల్లో 12 రకాల సదుపాయాలను కల్పించేందుకు రూ.3,497 కోట్లు ఖర్చు చేయనున్న ట్టు వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని పాఠశాలల్లో పనులను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థ లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ బడులను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ‘మన ఊరు-మన బడి’ ద్వారా రాష్ట్రంలోని 26 వేల పైచిలుకు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు సమకూరనున్నాయని తెలిపారు.