Hanumakonda | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.